తలసానికి దాసోజు శ్రవణ్ కౌంటర్

ABN , First Publish Date - 2021-02-27T23:15:05+05:30 IST

రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి

తలసానికి దాసోజు శ్రవణ్ కౌంటర్

హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ తోకముడిచిన తారక రామారావు అని తన పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయనే చర్చకు సిద్ధమన్నారని, తేలుకుట్టిన దొంగలా పారిపోయారని విమర్శించారు. ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో తనను తిట్టించడం కేటీఆర్‌కు తగదన్నారు. నిరుద్యోగ సమస్యలు మాట్లాడితే గొట్టం గాళ్లమా అంటూ ఫైర్ అయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ను ఉద్దేశించి మాట్లాడతూ.. బుద్దిలేని సన్నాసి అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 


తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టె రాజకీయ బిక్షగాడు తలసాని అని విమర్శించారు. ‘‘గొట్టంగాళ్లే నీకు కర్రుకాల్చి వాత పెడతారు.. చెంచాగిరి చేసే నీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ గొట్టంగాని కోసమే 2009లో నా ఇంటికి వచ్చావు కేటీఆర్. నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకున్నావు. కిరణ్ కుమార్ సీఎంగా దిగిపోయే నాటికి లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కాంగ్రెస్ హయాంలో 10వేలే వచ్చాయనడం పచ్చి అబద్ధం. నేను చెప్పేది తప్పని గన్ పార్క్‌కు వచ్చి కేటీఆర్ నిరూపిస్తే అక్కడే గొంతుకోసుకుని చనిపోతా’’ అని సవాల్ విసిరారు. 

Updated Date - 2021-02-27T23:15:05+05:30 IST