కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి

ABN , First Publish Date - 2022-03-12T22:04:45+05:30 IST

శాసనసభ ద్వారా ప్రజలను మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ

కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి

హైదరాబాద్: శాసనసభ ద్వారా ప్రజలను మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఊరు-మన బడి బాగా లేదని తాను చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఆ పథకానికి నిధులు లేవనే తాను చెప్పానన్నారు. సభలో చర్చ నడుస్తుందంటే కారణం తామేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహకరిస్తేనే సభ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్య వైద్యానికి ప్రభుత్వం బడ్జెట్ తక్కువ కేటాయించిందన్నారు. పాఠశాలలో చాలా ఖాళీలు ఉన్నాయన్నారు. పాఠశాలలో పనిచేసే వారి స్వీపర్ల జీతాలు ఇంకా 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి పథకానికి స్టేట్ బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఏసీడీపీ నిధులను కేటాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు పాఠశాలలో ఖాళీలు ఉండకుండా చూడాలని ఆయన కోరారు.   

Updated Date - 2022-03-12T22:04:45+05:30 IST