Agniveerల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై KTR ఫైర్
ABN , First Publish Date - 2022-06-20T18:31:32+05:30 IST
అగ్నివీర్(Agniveer)ల అంశంలో బీజేపీ నేతల(BJP Leaders) వ్యాఖ్యలపై ట్విటర్(Twitter) వేదికగా మంత్రి కేటీఆర్(Minister KTR) ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : అగ్నివీర్(Agniveer)ల అంశంలో బీజేపీ నేతల(BJP Leaders) వ్యాఖ్యలపై ట్విటర్(Twitter) వేదికగా మంత్రి కేటీఆర్(Minister KTR) ఫైర్ అయ్యారు. అగ్నిపథ్తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని.. మరో బీజేపీ నేత చెప్పారన్నారు. పీఎం మోదీ(PM Modi)ని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్(Agnipath)ను తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మోదీ-ఆదానీ అవినీతిపై.. శ్రీలంక ఆరోపణల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ను తీసుకొచ్చారని తన ట్వీట్లో కేటీఆర్ ఆరోపించారు.