ఏపీలో కృష్ణా నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నాం: సజ్జల
ABN , First Publish Date - 2021-07-14T00:43:37+05:30 IST
ఏపీలో కృష్ణా నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో
అమరావతి: ఏపీలో కృష్ణా నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పాదన చేస్తోందని ఆరోపించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఏపీలో దుర్మార్గమైన పరిస్థితులకు చంద్రబాబే కారణమని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.