గుంటూరు జిల్లాలో కృష్ణనది వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-28T14:30:08+05:30 IST

గుంటూరు జిల్లాలో కృష్ణనది వరద ఉదృతి కొనసాగుతోంది.

గుంటూరు జిల్లాలో కృష్ణనది వరద ఉధృతి

గుంటూరు: జిల్లాలో కృష్ణనది వరద ఉదృతి కొనసాగుతోంది. అమరావతి మండలం, పెదమద్దూరు ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. మునుగోడు-జూపూడి మధ్య మెయిన్‌రోడ్డుకు వరద నీరు తాకింది. అచ్చంపేట మండలం, తాడువాయి వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు నది పరివాహక ప్రాంతంలోని  పంటల్లోకి చేరింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పల్లెపాలెంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు తాడేపల్లి కరకట్ట ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరకట్ట మీద ఉన్న చిగుర ఆశ్రమం విద్యార్థులను విజయవాడకు తరలించారు.

Updated Date - 2020-09-28T14:30:08+05:30 IST