కృష్ణా: రెండు గ్రామాలలో లాక్ డౌన్
ABN , First Publish Date - 2021-08-01T00:31:20+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా
కృష్ణా: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడి దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీరులపాడు మండలంలోని దోడ్డదేవరపాడు, కొనతాలపల్లి గ్రామాలలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఆయా గ్రామాలలో అధికారులు లాక్డౌన్ విధించారు. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.