ఆటో ఎక్కిన యువతిని ఇంట్లో బంధించి..

ABN , First Publish Date - 2021-01-24T18:02:55+05:30 IST

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని బలవంతంగా గదిలో బంధించి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

ఆటో ఎక్కిన యువతిని ఇంట్లో బంధించి..

కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని బలవంతంగా గదిలో బంధించి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మచిలీపట్నం మండలంలోని కోన గ్రామంలో ఈ ఘటన జరిగింది. సోదరుడితో మార్కెట్‎కు వెళ్లిన యువతి ఇంటికి తిరిగి వస్తుండగా ఆటో ఎక్కింది. అయితే, ఆటోలో తనతో పాటు సోదరుడు నాగబాబు కూడా తోడున్నాడు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో సామాన్లు తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ మరో రోడ్డులోకి దారి మళ్లించాడు. సరాసరి తన ఇంటికి తీసుకు వెళ్లాడు. సామాన్లను ఇంట్లోకి అందించాలని చెప్పి.. మెల్లగా ఇంట్లోకి తీసుకు వెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో వచ్చిన సోదరుడు కూడా రామాంజనేయులు అనే వ్యక్తికి సహకరించాడని యువతి పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-24T18:02:55+05:30 IST