కృష్ణా జిల్లాలో బైక్‎ను ఢీకొన్న టిప్పర్ లారీ, వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-06T17:42:38+05:30 IST

జిల్లాలోని తిరువూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాడు వద్ద భైక్‎పై వెళ్తున్న ఇద్దరు దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ భర్త దాసరి...

కృష్ణా జిల్లాలో బైక్‎ను ఢీకొన్న టిప్పర్ లారీ, వ్యక్తి మృతి

కృష్ణా: జిల్లాలోని తిరువూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాడు వద్ద  భైక్‎పై వెళ్తున్న ఇద్దరు దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ భర్త దాసరి కృష్ణ (30) అక్కడికక్కడే మృతి చెందగా..భార్య (అలివేలు) పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తిరువూరులో ఒక శుభకార్యానికి హాజరై మధిరకు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-06T17:42:38+05:30 IST