Krishna: ఇంటి స్థలం విషయంలో పరస్పరం దాడులు చేసుకున్న ఇరువర్గాలు
ABN , First Publish Date - 2021-08-16T16:55:42+05:30 IST
గూడూరు మండలం మన్నాడులో ఇరువర్గాలు ఇంటి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పర్సపరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి
కృష్ణా: గూడూరు మండలం మన్నాడులో ఇరువర్గాలు ఇంటి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇంటి యజమాని అయిన బొమ్మ నాగేశ్వరరావుపై దుండగులు హత్యాయత్నం చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నాగేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.