Krishna: నూజివీడులో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2021-08-10T13:13:40+05:30 IST
నూజివీడులో దొంగల హల్ చల్ సృష్టిస్తున్నారు. రాత్రి 9 తరువాత లాక్డౌన్ ఉండటంతో దొంగలకు అనువుగా మారింది. మరొవైపు జనంసంచారం లేకపోయింది. దీంతో ఇదే చనువుగా తీసుకున్న
కృష్ణా: నూజివీడులో దొంగల హల్ చల్ సృష్టిస్తున్నారు. రాత్రి 9 తరువాత లాక్డౌన్ ఉండటంతో దొంగలకు అనువుగా మారింది. మరొవైపు జనంసంచారం లేకపోయింది. దీంతో ఇదే చనువుగా తీసుకున్న దుండగులు ఏటీఎంలపై కన్నువేశారు. నూజివీడు మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం పగులగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించగా అ ప్రయత్నం విఫలయత్నం అయింది. మరో కేసులో బంగారం షాపులో యజమాని దృష్టి మరల్చి ఐదు కాసుల గొలుసు దొంగిలించాడు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరు కేసుల నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.