15 రోజుల్లో రూ.53,000 కోట్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2020-03-28T06:10:10+05:30 IST

పండగలు, ఎన్నికల సమయంలోనే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్‌-19తో తలెత్తిన తిప్పల నుంచి బయటపడేందుకూ...

15 రోజుల్లో రూ.53,000 కోట్ల ఉపసంహరణ

ముంబై: పండగలు, ఎన్నికల సమయంలోనే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్‌-19తో తలెత్తిన తిప్పల నుంచి బయటపడేందుకూ ప్రజలు పెద్దఎత్తున బ్యాంకుల నుంచి నగదు వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి 13తో ముగిసిన 15 రోజుల్లో రూ.53,000 కోట్ల నగదును ప్రజలు బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకున్నారు. గత 16 నెలల్లో ఎన్నడూ బ్యాంకుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు వెనక్కి తీసుకోలేదు. దీంతో ప్రజల దగ్గర చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది. 

Updated Date - 2020-03-28T06:10:10+05:30 IST