కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్

ABN , First Publish Date - 2020-07-09T21:38:24+05:30 IST

కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్

కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్

అమరావతి: కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చొరవతో కృష్ణపట్నం పోర్టు ట్రస్టు యాజమాన్యం ముందుకొచ్చింది. కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సామాజిక బాధ్యతను కలెక్టర్ అభినందించారు. పారిశ్రామిక సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పిలుపు ఇచ్చారు. కృష్ణపట్నం పారిశ్రామిక వాడలో కొవిడ్ పాజిటివ్ బాధితులకు చికిత్స అందించనున్నారు. తొలిదశలో 100 ఐసోలేషన్ బెడ్లు, 20 బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య శాఖ తెలిపింది. అవసరాన్ని బట్టి క్లినిక్, బెడ్ల సామర్ధ్యాన్ని పెంచనున్నారు. వైద్య నిపుణులు, సిబ్బందిని కృష్ణపట్నం పోర్టు ట్రస్టు నియమించినట్లు వైద్య శాఖ తెలిపింది. 

Updated Date - 2020-07-09T21:38:24+05:30 IST