చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం

ABN , First Publish Date - 2020-08-08T23:29:21+05:30 IST

చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు సిబ్బంది మరో 50 మందికి అధికారులు కరోన పరీక్షలు చేయించారు.

చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం

తిరుపతి: చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు సిబ్బంది మరో 50 మందికి అధికారులు కరోన పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో శుక్రవారం 40 మందికి ఈ రోజు 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. ట్రైనింగ్ కళాశాలలో మొత్తం 73 మందికి పాజిటీవ్‌గా నిర్దారించారు. మరింత మంది ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. శిక్షణ పొందుతున్న అందరికీ  కొవిడ్ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఏడు జిల్లాలల్లోని వీరి కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. కొవిడ్ విజృభిస్తున్న నేపథ్యంలో శిక్షణ కళాశాలను మూసివేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా సోకిన వారిని కొవిడ్ కేర్ సెంటర్‌కు అధికారులు తరలించారు. ట్రైనింగ్ కళాశాలను అధికారులు సానిటేషన్ చేశారు.

Updated Date - 2020-08-08T23:29:21+05:30 IST