కోటంచ ఆలయ చైర్పర్సన్గా అనిత
ABN , First Publish Date - 2022-08-08T05:40:16+05:30 IST
కోటంచ ఆలయ చైర్పర్సన్గా అనిత
రేగొండ, ఆగస్టు7: కోటంచ ఆలయ చైర్పర్సన్గా మాదాడి అనితను నియమించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రమా ణ స్వీకారం చేశారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. అనితను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. కోటంచ గ్రామానికి చెందిన మాదాడి అనిత టీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఆలయ కమిటీ డైరెక్టర్గా కొనసాగిన ఆమెకు చైర్పర్సన్గా అవకాశం దక్కింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ హింగె మహేందర్, సర్పంచ్ పబ్బా శ్రీనివాస్, ఎంపీటీసీ రవీందర్రావు, జడ్పీటీసీ సాయిని విజయ, విద్యాసంస్థల చైర్మన్ సంపత్రావు పాల్గొన్నారు.