ఈటలకు ఓటమి భయం పట్టుకుంది: కొప్పుల ఈశ్వర్
ABN , First Publish Date - 2021-09-07T01:16:56+05:30 IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు. ఈటల సహనం కోల్పోతున్నాడని అనడానికి ఇది
జమ్మికుంట: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు. ఈటల సహనం కోల్పోతున్నాడని అనడానికి ఇది నిదర్శనం అన్నారు. ఎన్నికలను ఎన్నికలుగానే చూడాలని, విలువలు తగ్గించుకోవడం మంచిది కాదని హితవు పలికారు. అందరూ వదిలి వెళ్లిపోతుండడం వల్లే ఈటల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపికి పట్టు లేదని, అందుకోసమే ఈటల ప్రలోభాలకు గురి చేస్తున్నాడని విమర్శించారు. రెండు సార్లు మంత్రిగా ఉన్న కూడ జమ్మికుంటలో అభివృద్ది చేయలేదని, ఇప్పటికే 50 కోట్ల నిధులు ఇచ్చామని, మరో 50 కోట్ల నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు. కట్టు బానిసలు అన్న పదానికి అర్థం ఏమిటో ఈటల చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.