నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-05-29T19:44:57+05:30 IST
కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు చేరాయని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా: కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు చేరాయని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగం వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. భూ నిర్వాసితులకు సిద్దిపేట ఎస్ఈజడ్లో ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్ రెండో అతిపెద్ద ప్రాజెక్టని అన్నారు. 53లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రం పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టని, తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమన్నారు.