బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి!

ABN , First Publish Date - 2022-06-30T10:03:59+05:30 IST

ఆంధ్రజ్యోతి, జూన్‌ 29(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరే ముహుర్తం దాదాపుగా ఖరారైంది. జూలై 3న బీజేపీ నిర్వహిస్తున్న విజయ్‌

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి!

విజయ్‌ సంకల్ప్‌ వేదికపై  పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

తరుణ్‌ చుగ్‌, సంజయ్‌తో చర్చలు సఫలం

నేడు ప్రకటించనున్న మాజీ ఎంపీ 

ఆంధ్రజ్యోతి, జూన్‌ 29(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరే ముహుర్తం దాదాపుగా ఖరారైంది. జూలై 3న బీజేపీ నిర్వహిస్తున్న విజయ్‌ సంకల్ప్‌ సభలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. బీజేపీలో చేరే అంశంపై గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తానని విశ్వేశ్వర్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. నిజానికి, వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వడివడిగా అడుగులేస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త, తటస్థ నేతలను తమ వైపు తిప్పుకుంటోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా వారందరినీ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బుధవారం కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వారి మధ్య చర్చలు సఫలమైనట్టు తెలిసింది. కాగా, కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి కొంతకాలంగా తటస్థంగా ఉన్నారు. కొండాను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించినా ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. 

Updated Date - 2022-06-30T10:03:59+05:30 IST