‘కోనసీమ’ వైసీపీ ప్లీనరీకి జనం కరువు
ABN , First Publish Date - 2022-07-04T09:31:32+05:30 IST
‘కోనసీమ’ వైసీపీ ప్లీనరీకి జనం కరువు
అమలాపురం, జూలై 3: రామచంద్రపురంలో జరిగిన కోనసీమ జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశానికి జనం కరువయ్యారు. ఇక్కడి వీఎ్సఎం కళాశాలలో ఆదివారం సభ ప్రారంభమైన అరగంటలోనే.. వచ్చిన కొద్దిమంది మహిళలు కూడా వెళ్లిపోతుండడంతో పార్టీ నేతలతోపాటు.. సాక్షాత్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ సైతం వేదిక దిగివచ్చి.. సభ నుంచి వెళ్లొద్దని బతిమాలడం కనిపించింది. మహిళా వలంటీర్లు వలయంగా ఏర్పడి సభ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నా ఫలితం లేకపోయంది. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లాకు చెందిన మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీలు పిల్లి సుభా్సచంద్రబోస్, చింతా అనురాధ, రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డిలు హాజరయ్యారు.