కోమటిరెడ్డిని కొనియాడిన రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-02-15T21:53:54+05:30 IST
అందరు పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉధ్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు.
హైదరాబాద్: అందరు పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉదమం కోసం మంత్రి పదవి త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు. భవిష్యత్ కార్యచరణ పై ఇద్దరం చర్చించామన్నారు. తాము చర్చించిన అంశాలను పార్టీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ దేశ సమైక్యత కోసం కృషి చేసిన గాంధీ కుటుంబం గురించి అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలిస్స్టేషన్లలో అస్సాం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశామన్నామని తెలిపారు. ఒక్క పోలీస్ స్టేషన్లలో కూడా ఏఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసీఆర్ మోడీ కోవర్ట్ అని, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలను చీల్చేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలతోనే కేసీఆర్ ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రంట్ పేరుతో టెంట్ వేసి.. కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు.