కేటీఆర్ ఎక్కడ ఉద్యమం చేశారో చెప్పాలి?: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-21T23:11:09+05:30 IST
కేటీఆర్ ఎక్కడ ఉద్యమం చేశారో చెప్పాలి?: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఇప్పటికే 30 శాతం రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారని చెప్పారు. ప్రభుత్వం మద్దతుధరతో ధాన్యం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ధాన్యం అమ్ముకున్న రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. రేవంత్రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. కేటీఆర్ ఎక్కడ ఉద్యమం చేశారో చెప్పాలి? కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.