తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-05T22:58:57+05:30 IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటిపైకి తెస్తానన్నారు. ..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా: కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటిపైకి తెస్తానన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తరపున పోరాడుతామని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రజలకు భారంగా మారిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూసైనా ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని సూచించారు. వరదసాయం అందనివారికి మళ్లీ రూ.10వేల సాయం చేయాలని డిమాండ్ చేశారు. వరద సాయం చేయకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు. కాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసి వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. 


Updated Date - 2020-12-05T22:58:57+05:30 IST