రూ. 12.25 కోట్లకు శ్రేయాస్‌‌ను దక్కించుకున్న కోల్‌కతా.. పంజాబ్‌‌కు రబడా

ABN , First Publish Date - 2022-02-12T18:24:47+05:30 IST

ముందు నుంచి మంచి అంచనాలు ఉన్న భారత యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌‌ భారీ ధర పలికాడు.

రూ. 12.25 కోట్లకు శ్రేయాస్‌‌ను దక్కించుకున్న కోల్‌కతా.. పంజాబ్‌‌కు రబడా

బెంగళూరు: ముందు నుంచి మంచి అంచనాలు ఉన్న భారత యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌‌ భారీ ధర పలికాడు. అయ్యర్‌‌‌ను కేకేఆర్ ఏకంగా రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో రూ. 7కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ఆడిన అయ్యర్‌ కనీస ధర రూ. 2 కోట్లతో ఈసారి వేలంలోకి దిగాడు. అయ్యర్ కోసం ఢిల్లీ, గుజరాత్‌, కోల్‌కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకుంది. అటు సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడాను పంజాబ్ రూ. 9.25 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన రబాడ కోసం గుజరాత్‌ గట్టిగానే ప్రయత్నించింది. చివరికి పంజాబ్‌​రూ. 9.25 కోట్లతో రబాడను దక్కించుకుంది.



Updated Date - 2022-02-12T18:24:47+05:30 IST