కోహ్లీ ఆగ్రహం.. రెఫరీ మందలింపు
ABN , First Publish Date - 2021-04-16T06:10:29+05:30 IST
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాచ్ రెఫరీ మందలించాడు. హైదరాబాద్తో బుధవారం జరిగిన మ్యాచ్లో అవుటైన అనంతరం కోహ్లీ (29 బంతుల్లో 33 పరుగులు) తీవ్ర ఆగ్రహంతో డగౌట్లో...
చెన్నై: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాచ్ రెఫరీ మందలించాడు. హైదరాబాద్తో బుధవారం జరిగిన మ్యాచ్లో అవుటైన అనంతరం కోహ్లీ (29 బంతుల్లో 33 పరుగులు) తీవ్ర ఆగ్రహంతో డగౌట్లో ఉన్న కుర్చీని బ్యాట్తో కొట్టాడు. ఇది ఐపీఎల్ నియమావళి ఉల్లంఘన కిందకు రావడంతో మ్యాచ్ రెఫరీ విరాట్ను మందలించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.