ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ అలా అన్నాడు.. చెప్పేసిన మ్యాక్స్‌వెల్

ABN , First Publish Date - 2021-04-16T11:12:55+05:30 IST

ఐపీఎల్‌లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. తాజాగా ఆస్ట్రేలియన్ విధ్వంసం గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేరికతో ఈ జట్టు మరింత బలంగా కనబడుతోంది. అయితే మరి మ్యాక్స్‌వెల్ ఈ జట్టులో చేరతాడని ఎవరైనా ఊహించారా?

ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ అలా అన్నాడు.. చెప్పేసిన మ్యాక్స్‌వెల్

బెంగళూరు: ఐపీఎల్‌లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. తాజాగా ఆస్ట్రేలియన్ విధ్వంసం గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేరికతో ఈ జట్టు మరింత బలంగా కనబడుతోంది. అయితే మరి మ్యాక్స్‌వెల్ ఈ జట్టులో చేరతాడని ఎవరైనా ఊహించారా? ఈ ప్రశ్నకు మ్యాక్స్‌వెల్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ మాటలను బట్టి తాను బెంగళూరుకు ఆడే అవకాశం ఉందని తెలిసిందని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.


ఆ ఆలోచన ఉన్నట్లు కోహ్లీ సూచనప్రాయంగా చెప్పినట్లు అతను వెల్లడించాడు. ఆర్‌సీబీకి ఆడటం గురించి కోహ్లీ తనతో మాట్లాడాడని, ఆ అవకాశం దొరికితే చాలా బాగుంటుందని కోహ్లీ అన్నాడట. ఆ తర్వాత జరిగిన వేలంలో మ్యాక్స్‌వెల్‌ను బెంగళూరు జట్టు కొనుగోలు చేసేసింది.

Updated Date - 2021-04-16T11:12:55+05:30 IST