ధోనీని దాటేసిన కోహ్లీ..
ABN , First Publish Date - 2021-02-26T01:44:31+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటేశాడు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించిన కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 21 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉండగా....
అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటేశాడు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించిన కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 21 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక ఈ రోజు(గురువారం) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో విజయం ద్వారా ఆ రికార్డును కోహ్లీ దాటేశాడు. మొత్తం 22 విజయాలతో టాప్ ప్లేస్కు చేరుకున్నాడు.