Edgbaston test : క్రీజులో కుదురుకున్న పుజారా, కోహ్లీ... రెండో ఇన్నింగ్స్లో స్కోరు..
ABN , First Publish Date - 2022-07-04T03:42:14+05:30 IST
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. మూడవ రోజు ఆట ఇంకా 33 ఓవర్లు మిగిలివుండగా జట్టు స్కోరు 73/2గా ఉంది. చతేశ్వర పుజారా(32), విరాట్ కోహ్లీ(20) పరుగులతో క్రీజులో
బర్మింగ్హామ్ : ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. మూడవ రోజు ఆట ఇంకా 33 ఓవర్లు మిగిలివుండగా జట్టు స్కోరు 73/2గా ఉంది. చతేశ్వర పుజారా(32), విరాట్ కోహ్లీ(20) పరుగులతో క్రీజులో ఉన్నారు. శుభమన్ గిల్(4), హనుమ విహారి(11) తర్వాత మరో వికెట్ పడకుండా ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెరో వికెట్ తీశారు.
284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్..
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్కు 132 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 84/5తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ కొద్దిసేపు పోరాడినట్టు కనిపించినా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. జానీ బెయిర్స్టో 119 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశారు. భారత్పై అతడికి అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. స్టోక్స్ 25, శామ్ బిల్లింగ్స్ 36, మాటీ ప్యాట్స్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ శుభమన్ గిల్ (4) అవుటయ్యాడు. ప్రస్తుతం చతేశ్వర్ పుజారా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు.