కేఎల్ రాహుల్కు జరిమానా
ABN , First Publish Date - 2021-09-06T00:02:23+05:30 IST
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్కు ఐసీసీ జరిమానా విధించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న
లండన్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్కు ఐసీసీ జరిమానా విధించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో రాహుల్ 46 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగులో కీపర్ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, ఇది అవుట్ కాదంటూ థర్డ్ అంపైర్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన బ్యాట్ ప్యాడ్స్కు తాకిందని భావించాడు. అయితే, రీప్లేలో మాత్రం బ్యాట్ ప్యాడ్లకు తాకలేదని, బంతికే తాకిందని తేలింది. అయితే, ఇదేమీ పట్టించుకోని రాహుల్ తన బ్యాట్ ప్యాడ్స్కు తాకిందని, కానీ రీప్లేలో మాత్రం వేరేలా వస్తోందని సైగల ద్వారా ఆన్ఫీల్డ్ అంపైర్కు చెబుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
రాహుల్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. దీంతోపాటు అతడి క్రమశిక్షణ రికార్డుకు ఓ డీమెరిట్ పాయింట్ను జతచేసింది. గత 24 నెలల్లో రాహుల్కు ఇదే తొలి తప్పు కావడం గమనార్హం. రాహుల్ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.