టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
ABN , First Publish Date - 2021-04-14T00:53:48+05:30 IST
ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్ రైడర్స్ మరి కాసేపట్లో తలపడబోతున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరగనున్న..
చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్ రైడర్స్ మరి కాసేపట్లో తలపడబోతున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవు. తొలి మ్యాచ్లో ఆడిన జట్లతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగింది. కానీ ముంబై మాత్రం తొలి మ్యాచ్లో రాణించిన క్రిస్లిన్ ముంబై పక్కన కూర్చోబెట్టింది.
కోల్కతా: నితీష్ రానా, శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.
ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జాన్సన్, ట్రెంట్ బౌల్ట్ , జస్ప్రీత్ బుమ్రా.