రైజర్స్పై కేకేఆర్ విజయం
ABN , First Publish Date - 2021-10-04T05:36:41+05:30 IST
ఐపీఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ సునాయాస విజయం సాధించింది. ముందుగా బౌలింగ్లో..
ఐపీఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ సునాయాస విజయం సాధించింది. ముందుగా బౌలింగ్లో కేకేఆర్ బౌలర్లు ఎస్ఆర్హెచ్ను ముప్పు తిప్పలు పెట్టారు. టిమ్ సౌతీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లతో మెరవగా, షకిబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసి ఎస్ఆర్హెచ్ను కేవలం 115 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఓపెనర్ శుభ్మన్ గిల్(57: 51 బంతుల్లో, 10 ఫోర్లు) అర్థ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కేకేఆర్ విజయానికి చేరువైంది. అయితే శిద్ధార్థ్ కౌల్ బౌలింగ్లో గిల్ అవుటైన తరువాత స్కోరు కొంచెం నెమ్మదించింది. అయితే మిడిల్ ఆర్డర్లో నితీశ్ రాణా(25: 33 బంతుల్లో, 4 ఫోర్లు) మళ్లీ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
చివర్లో దినేశ్ కార్తీక్(18 నాటౌట్: 12 బంతుల్లో, 3 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్(2) వికెట్ పడకుండా లాంఛనం పూర్తి చేశారు. 19.4 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి విజయం దక్కించుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, శిద్దార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు. అర్థసెంచరీతో రాణించిన కేకేఆర్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.