మూడో వికెట్ కోల్పోయిన కివీస్
ABN , First Publish Date - 2021-06-22T22:59:59+05:30 IST
భారత్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్
సౌతాంప్టన్: భారత్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 101/2తో ఐదో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 16 పరుగులు మాత్రమే చేసి మూడో వికెట్ కోల్పోయింది. 37 బంతులు ఎదుర్కొన్న రాస్ టేలర్ 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసి షమీ బౌలింగులో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం విలియమ్సన్ (15), హెన్రీ నికోలస్ (1) క్రీజులో ఉన్నారు. మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిన కివీస్ భారత్ కంటే 94 పరుగులు వెనుకబడి ఉంది.