ఖైరతాబాద్కు భారీగా చేరుకున్న Congress కార్యకర్తలు
ABN , First Publish Date - 2022-06-16T17:19:46+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్భవన్కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది.
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్భవన్కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్భవన్ వద్ద నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఖైరతాబాద్కు చేరుకున్నారు. మరికాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.. పీజేఆర్ విగ్రహం వద్ద కి చేరుకోనున్నారు.