ఎన్నారైల పునరావాసం కోసం రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ

ABN , First Publish Date - 2021-10-29T04:19:57+05:30 IST

కరోనా సంక్షోభం కారణంగా స్వదేశానికి శాశ్వతంగా తిరిగొచ్చిన ఎన్నారైల పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ కొత్త ప్రతిపాదన పంపించేనందుకు సిద్దమవుతోంది.

ఎన్నారైల పునరావాసం కోసం రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ

తిరువనంతపురం: కరోనా సంక్షోభం కారణంగా స్వదేశానికి శాశ్వతంగా తిరిగొచ్చిన ఎన్నారైల పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ కొత్త ప్రతిపాదన పంపించేందుకు సిద్ధమవుతోంది. విదేశాల నుంచి కేరళకు తిరిగొచ్చిన వారి కోసం కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలనే ప్రతిపాదన పంపనుంది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం  అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.  ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం.. 2020 మే నుంచి ఇప్పటివరకూ దాదాపు 39 లక్షల మంది ఎన్నారైలు కేరళకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సీఎం అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ప్రతిపాదిస్తున్న ప్యాకేజీ ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలకు అదనమని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-29T04:19:57+05:30 IST