కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బడి పిల్లలపై డ్రగ్స్ నీడ పడకుండా ఏం చేయనున్నదంటే..
ABN , First Publish Date - 2021-10-25T14:05:33+05:30 IST
పాఠశాల విద్యార్థులను..
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులను మద్యపానం, డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉంచేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఉనర్వు’ (మేలుకొలుపు) పేరుతో ఆబ్కారీ శాఖ పరిధిలోని విముక్తి మిషన్ పాఠశాల విద్యార్థులకు జాగృతం చేయనుంది. చెడు అలవాట్లను మాన్పించి.. కళలు, క్రీడల దిశగా పిల్లల ఆసక్తులను మళ్లించి వారి ఉజ్వల భవిష్యత్తును పరిరక్షించనుంది. ఈ ఏడాది కేరళ అసెంబ్లీని ఉద్దేశించి తన ప్రసంగంలో గవర్నర్ ప్రతిపాదించిన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.