త్వరలో సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2022-02-04T02:44:01+05:30 IST
త్వరలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్
సంగారెడ్డి: త్వరలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నాలుగైదు రోజుల్లో సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూలు ఖరారు కానున్నది. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు సీఎం శంకుస్థాపన చేయ్యనున్నారు. రాయికోడ్ మండలంలోని జంబ్గి (కే), నాగ్వార్ గ్రామ శివారుల్లో సభ నిర్వహణకు అనువైన సభాస్థలిలను ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ పరిశీలించారు.