దళిత, గిరిజన హక్కులను కాలరాస్తున్న కేసీఆర్: సీతక్క
ABN , First Publish Date - 2021-08-01T01:19:23+05:30 IST
సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దళిత, గిరిజన హక్కులను
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దళిత, గిరిజన హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. పోడు భూములపై హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీనని తెలిపారు. హరితహారం పేరుతో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు. దళితులు, గిరిజనులకు భూములివ్వలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని సీతక్క ధ్వజమెత్తారు.