కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటన రద్దు ?
ABN , First Publish Date - 2022-05-27T08:36:44+05:30 IST
సీఎం కేసీఆర్ శుక్రవారం చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ శుక్రవారం చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తిరిగి వచ్చారుగానీ... 27న చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది పర్యటన గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.