TS News: కేసీఆర్ సర్కారు డ్వాక్రా (DWCRA) సంఘాలను నిర్వీర్యం చేస్తుంది: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-08-12T22:24:42+05:30 IST
Yadadri: సీఎం కేసీఆర్ (CM KCR)కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana State President Bandi Sanjay) లేఖ రాశారు. ప్రభుత్వం డ్వాక్రా (DWCRA) సంఘాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సెర్ఫ్, మెప్మా, ఎస్హెచ్జీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని, ఆ బకాయిలను వెంటనే
Yadadri: సీఎం కేసీఆర్ (CM KCR)కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana State President Bandi Sanjay) లేఖ రాశారు. ప్రభుత్వం డ్వాక్రా (DWCRA) సంఘాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సెర్ఫ్, మెప్మా, ఎస్హెచ్జీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు బడ్జెట్లో రూ.1,250 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో డ్వాక్రా మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నాయని చెప్పారు.