కేసీఆర్కు సోయి లేదు: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-12-18T00:27:12+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని, సోయి ఉండదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.
రామగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని, సోయి ఉండదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని, అవసరమైతే తలను నరుక్కుంటానేగానీ మాట తప్పనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ తల తెగలేదు... దళితుడు ముఖ్యమంత్రి కాలేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రజలు మాత్రం సరైన బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని డీకే అరుణ తెలిపారు.