రైతులతో కేసీఆర్‌ వ్యాపారం: భట్టి

ABN , First Publish Date - 2020-12-28T20:21:27+05:30 IST

రైతులతో కేసీఆర్‌ వ్యాపారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రైతులతో కేసీఆర్‌ వ్యాపారం: భట్టి

ఖమ్మం: రైతులతో  సీఎం కేసీఆర్‌ వ్యాపారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ నిన్నటి వరకు రైతులకు మద్దతు తెలిపి ఇప్పుడు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తుగా మారారని మండిపడ్డారు. రైతులే పంట అమ్ముకోవాలని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల నడ్డివిరిచేలా మోదీ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని  భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-28T20:21:27+05:30 IST