కరీంనగర్‌ కారు ప్రమాద ఘటన నిందితులు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-30T23:08:54+05:30 IST

కరీంనగర్‌ కారు ప్రమాద ఘటన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరీంనగర్‌ కారు ప్రమాద ఘటన నిందితులు అరెస్ట్‌

కరీంనగర్: కరీంనగర్‌ కారు ప్రమాద ఘటన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలుడు కారు నడపడం వల్ల ప్రమాదానికి జరిగినట్లు నిర్థారించారు. కారు యజమాని కుమారుడు డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని, ఇద్దరు మైనర్‌ స్నేహితులతో కలిసి కారు నడిపాడని సీపీ సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్‎లోని కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్వప్న, లలిత, జ్యోతి, సునితలుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-01-30T23:08:54+05:30 IST