కట్టడిలో బడి పనులా?: కన్నా

ABN , First Publish Date - 2020-04-03T08:55:55+05:30 IST

కట్టడిలో బడి పనులా?: కన్నా

కట్టడిలో బడి పనులా?: కన్నా

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను కొన్నాళ్లు ఆపాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల పాఠశాలల భవనాలకు ‘నాడు-నేడు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేస్తోంది. ఈ పనుల వేగం పెంచేలా పాఠశాల విద్య కార్యదర్శి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సీఎంకు కన్నా లేఖ రాశారు. 

Updated Date - 2020-04-03T08:55:55+05:30 IST