పీపీఏలపై ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారా? : కన్నా
ABN , First Publish Date - 2020-07-05T08:32:42+05:30 IST
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) విషయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) విషయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి విదేశాలలో దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ మేరకు సీఎం జగన్కు శనివారం ఆయన లేఖ రాశారు. ఏపీలో అధిక విద్యుత్ టారి్ఫపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై అజయ్కల్లాం ప్రజలకు వివరణ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా మాట్లాడారని కన్నా ఆరోపించారు. విద్యుత్ చార్జీల్లో ఎటువంటి పెంపూ ఉండదని ఎన్నికల్లో వాగ్దానం చేసి... ఏడాదిలోనే రెండుసార్లు టారిఫ్ పెంచారని విమర్శించారు.