దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారు: కన్నా
ABN , First Publish Date - 2021-12-17T23:28:10+05:30 IST
ఒక్క చాన్స్ అంటూ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు.
తిరుపతి: ఒక్క చాన్స్ అంటూ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు. దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారని మండిపడ్డారు. విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారన్నారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారని చెప్పారు. అమరావతిలో అనేక ప్రాజెక్ట్లకు కేంద్రం నిధులిచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.