ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపుపై సీఈసీ, గవర్నర్కు కన్నా లేఖ
ABN , First Publish Date - 2020-04-11T03:05:03+05:30 IST
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ గవర్నర్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ గవర్నర్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని రమేష్ కుమార్పై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకున్నారని లేఖలో కన్నా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతీకారంతో తీసుకువచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పరిశీలించమని కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ను తిరస్కరించాలని కోరినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.