రమేష్పై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు: కన్నా
ABN , First Publish Date - 2020-04-11T01:10:45+05:30 IST
స్ఈసీ రమేష్పై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని ఎస్ఈసీపై వైసీపీ కక్ష కట్టిందని ఆరోపించారు.
విజయవాడ: ఎస్ఈసీ రమేష్పై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని ఎస్ఈసీపై వైసీపీ కక్ష కట్టిందని ఆరోపించారు. ఒక బిల్లును సెలక్ట్ కమిటీకి పంపితే కౌన్సిల్నే రద్దు చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి మంచిదికాదని కన్నా హితవుపలికారు. ఇలాంటి అరాచకాలకు ఇంతకుముందెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే రేపురేపు హైకోర్టునూ రద్దు చేస్తారేమో? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అహంకారపూరిత చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని, పోలీసులకు కూడా వైసీపీ ఖాతా నుంచి జీతాలు ఇవ్వాలని కన్నా లక్ష్మినారాయణ చెప్పారు.