అప్పుడు టీడీపీని ఎద్దేవా చేసి.. ఇప్పుడు మీరు చేస్తోందేంటి?: కన్నా

ABN , First Publish Date - 2020-02-19T18:31:47+05:30 IST

కడప: వైసీపీ అధికారంలోకి వస్తే... జగన్‌ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

అప్పుడు టీడీపీని ఎద్దేవా చేసి.. ఇప్పుడు మీరు చేస్తోందేంటి?: కన్నా

కడప: వైసీపీ అధికారంలోకి వస్తే... జగన్‌ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని విమర్శించారు. రాక్షస పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఎద్దేవా చేసి... ఇప్పుడు మీరు చేస్తున్నదేంటని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలంతా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. మోదీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక... ప్రతిపక్షాలు నక్క జిత్తుల వ్యవహారాలు చేస్తున్నాయని కన్నా విమర్శించారు.


Updated Date - 2020-02-19T18:31:47+05:30 IST