కాళేశ్వరం హుండీ లెక్కింపు

ABN , First Publish Date - 2021-01-19T04:32:19+05:30 IST

కాళేశ్వరం హుండీ లెక్కింపు

కాళేశ్వరం హుండీ లెక్కింపు
కాళేశ్వరాలయంలో హుండీలను లెక్కిస్తున్న సిబ్బంది

మహదేవపూర్‌, జనవరి 18: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని హుండీలను సోమవారం లెక్కించారు. ఆరు నెలల 15 రోజుల వ్యవధిలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల హుండీలను తెరిచారు. స్వామి వారికి రూ. 27 లక్షల 14 వేల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మమత, ఈవో మారుతి, పర్యవేక్షణాధికారి వేణుగోపాల్‌, భక్తులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T04:32:19+05:30 IST