ఏపీ నాశనానికే 3 రాజధానులు: కాల్వ

ABN , First Publish Date - 2020-08-08T22:26:47+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ‘రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే మూడు రాజధానులు. మూడు రాజధానుల

ఏపీ నాశనానికే 3 రాజధానులు: కాల్వ

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ‘రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే మూడు రాజధానులు. మూడు రాజధానుల అంశం ప్రజల్లో అపహాస్యమవుతోంది. మాట తప్పను.. మడమ తిప్పనన్న జగన్.. అమరావతి విషయంలో చేసిందేమిటి. అమరావతి రాజధానిపై జగన్‌ ఎందుకు మాట మారుస్తున్నారు. రాజధానిపై మంత్రి బొత్స నెలకో మాట మారుస్తున్నారు. ఇన్ని మాటలు మార్చిన మంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదు. ఏడాదిన్నర పాలనలో రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం. అమరావతిని అగాధ పాతానికి తొక్కే దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమకు త్రాగు, సాగు నీరు ఇచ్చారు. అనేక పరిశ్రమలు తెచ్చారు. వెనుకబడిన అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చిన ఘటన చంద్రబాబుదే. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దారు.  గండికోట నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-08-08T22:26:47+05:30 IST