AP News: జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉత్కంఠ
ABN , First Publish Date - 2022-07-28T18:30:30+05:30 IST
జిల్లాలోని జమ్మలమడుగులో ఉత్కంఠ కొనసాగుతోంది.
కడప: జిల్లాలోని జమ్మలమడుగులో ఉత్కంఠ కొనసాగుతోంది. మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 మంది పోలీసులు పహరా కాస్తున్నారు. నిన్న రాత్రి మాజీమంత్రి, రామ సుబ్బారెడ్డి వర్గీయుడిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల దాడి చేశారు. కత్తితో దాడి ఘటనలో రామసుబ్బారెడ్డి అనుచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. మట్టి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదు చేసినందుకే కత్తులతో హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తలమంచిపట్నం పోలీస్స్టేషన్లో 15 మందిపై కేసు నమోదు అయ్యింది.