Kadapa: వాహనం ఢీకొని చిరుత పులి మృతి
ABN , First Publish Date - 2022-02-09T15:26:59+05:30 IST
జిల్లాలోని శేషాచలం అటవీప్రాం తంలోని గువ్వల చెరువుఘాట్లో ప్రధానరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది.
కడప: జిల్లాలోని శేషాచలం అటవీప్రాం తంలోని గువ్వల చెరువుఘాట్లో ప్రధానరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. వెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుత పులికి సంవత్సరం వయస్సు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పక్కన చెరువులో నీటికోసం వెళ్తున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. కాగా చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.